Breaking News

మాతా, శిశు మరణాలు తగ్గించాలి

మాతా, శిశు మరణాలు తగ్గించాలి

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి కలెక్టర్​ఎం.ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్​లో జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఎప్పడికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తం ఉండేలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో డాక్టర్ వెంకటేశ్వర్​రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, జిల్లా సర్వేలైన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజి నవీన్​కుమార్ పాల్గొన్నారు.