![మధిరలో లాక్డౌన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/lockkkkkf-1.jpg?fit=364%2C280&ssl=1)
సారథిన్యూస్, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చారు.