Breaking News

మధిరలో స్వచ్ఛంద లాక్​డౌన్​

మధిరలో లాక్​డౌన్​

సారథిన్యూస్​, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్​ షాపులకు మినహాయింపు ఇచ్చారు.