![మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటివ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/HARISH-WITH-MASK-2F.jpg?fit=417%2C334&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను విడిచిపెట్టడం లేదు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేరిపోయారు. తనకు కోవిడ్19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని, గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్లో ఉండాలని ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యవంతంగానే ఉన్నానని తెలిపారు.కాగా, ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కరోనా ప్రబలకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు ఎవరైనా సరే అసెంబ్లీ ఆవరణలోకి రాకూడదని స్పీకర్ సూచించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/HARISHRAO.jpg?resize=640%2C299&ssl=1)