Breaking News

భారత్​ అమ్ములపొదికి రఫెల్​

భారత్​ అమ్ములపొదికి రఫెల్​

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రఫెల్​ యుద్ధవిమానాలు భారత్​కు వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్​బేస్​కు చేరుకున్నాయి. అబుదాబీ అల్​ద ఫ్రా సైనిక స్థావరం నుంచి ఇవి బయలుదేరాయి. తొలివిడతగా ఐదు యుద్ధవిమానాలు వచ్చాయి. వీటిలో మూడు యుద్ధ విమానాలు కాగా, రెండు శిక్షణ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు 50వేల అడుగుల ఎత్తుకు ఎగరగలవు. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఫ్రాన్స్​, ఈజిప్ట్​, ఖతార్​ దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ ఫ్లైట్​ ఉన్నాయి. ప్రస్తుతం ఇవి భారత్​ అమ్ములపొదికి చేరాయి. 9500 కేజీల బరువు ఉన్న ఆయుధాలను ఇవి మోసుకెళ్లగలవు.