Breaking News

బొగ్గుగనుల వేలం నిలిపివేయండి

గోదావరిఖని: సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ పిలుపుమేరకు ఆర్జీ​​-1 లో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్రకమిటీ సెక్రటరీ మెరుగు రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, ఉల్లి మొగిలి, జీ ఆనందం, పీ రవి, ఏ మహేశ్​, వంగల రాములు, నంది నారాయణ, బీ రవి, కారం సత్తయ్య, సీహెచ్​ ప్రభాకర్, బూరుగుల రాములు, గజేంద్ర, సాగర్, బీ శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.