![‘బాహుబలి’ గొప్ప మనసు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/prabhas.jpg?fit=677%2C417&ssl=1)
సారథి న్యూస్, జిన్నారం: గ్రీన్ చాలెంజ్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రముఖ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్కును తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు. అందుకోసం రూ.రెండుకోట్లు అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చుచేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/prabhas-2-2.jpg?resize=640%2C394&ssl=1)