![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/KARIMNAGAR-RAMADUGU.jpg?fit=1235%2C849&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.