Breaking News

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా

సారథి న్యూస్​, నిజామాబాద్: కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి వీఐపీల దాకా ఎప్పుడు ఎవరికి అంటుంటుందో తెలియడం లేదు. తాజాగా నిజామాబాద్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనను హుటాహుటినా చికిత్స కోసం హైదరాబాద్​కు తీసుకెళ్లారు. ఇదివరకే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్​గా రావడంతో ఆయన చికిత్సపొందుతున్నారు. అలాగే మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా పాజిటివ్​ కావడంతో మంత్రి కూడా హోంక్వారంటైన్​కే పరిమితమయ్యారు. ఈ పరంపరలో హైదరాబాద్​ నగర మేయర్​కు బొంతు రామ్మోహన్​ డ్రైవర్​కు కరోనా పాజిటివ్​ రావడంతో ఆయనకు కూడా మెడికల్​ టెస్టులు చేశారు.