Breaking News

ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనాకు ఎవరు కూడా బయపడొద్దు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది’ అని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్​ సుధాకర్ అన్నారు. మంగళవారం జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరానాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, చావులు ఉండకూడదని, కరోనాతో పోరాడి విజేతలైన వారు ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా పాజిటివ్​వస్తే హోం క్వారంటైన్​లో ఉండి నిరంతరం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ​సుధాకర్ ​ముందు రావడం అభినందనీయమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కొనియాడారు.