సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనాకు ఎవరు కూడా బయపడొద్దు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది’ అని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. మంగళవారం జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరానాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, చావులు ఉండకూడదని, కరోనాతో పోరాడి విజేతలైన వారు ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా పాజిటివ్వస్తే హోం క్వారంటైన్లో ఉండి నిరంతరం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ముందు రావడం అభినందనీయమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కొనియాడారు.
- July 29, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- BLOOD DONETE
- CARONA
- MLA SUDHAKAR
- TELANGANA
- కరోనా
- కర్నూలు
- తెలంగాణ
- Comments Off on ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి