![ప్రియాంకగాంధీ ఉద్వేగభరిత పోస్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/priyankaaaaaa-rahullll-FF.jpg?fit=729%2C406&ssl=1)
ఢిల్లీ: రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. ప్రేమ, సహనం వంటి ఉత్తమ గుణాలను సోదరుడు రాహుల్గాంధీ నుంచే తాను నేర్చుకున్నారని పేర్కొన్నారు. రాహుల్ లాంటి సోదరుడు దొరకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రాఖీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు.