![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRANABH-MUKAHRJEEFFGGGGGGGGG.jpg?fit=620%2C464&ssl=1)
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత రాహుల్ తదితరులు సంతాపం తెలిపారు.