సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్ఠాయి విద్య అందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని ఇందిరానగర్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
- July 22, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EDUCATION
- KCR
- TELANGANA
- ఉచితవిద్య
- తెలంగాణ
- ప్రభుత్వం
- సీఎం కేసీఆర్
- Comments Off on పేదలకు కార్పొరేట్ విద్య