![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/POOR-GIRL-GIRLFF.jpg?fit=700%2C302&ssl=1)
సారథిన్యూస్, రామగుండం: ఎన్టీపీసీకి చెందిన ఓ పేదయువతి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ఆసరాగా నిలిచింది. పెదపల్లి జిల్లా రామగుండం పరిధిలోని న్యూమారేడుపాకలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మేఘన అనే యువతికి వివాహం జరిగింది. మేఘన తల్లిదండ్రులు పేదరికంలో ఉండటంతో విషయం తెలుసుకున్న రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్.. పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మనిదీప్ ను అదేశించారు. దీంతో విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీప్ యువతికి ఫౌండేషన్ సభ్యులు రూ.10 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు ఇరుగురాళ్ల శ్రావణ్, అబ్బాస్, చొప్పదండి శ్రీకాంత్, వికాస్, జూల అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.