![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/PUSHPAAAAA.jpg?fit=259%2C194&ssl=1)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవిమేకర్స్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం పరిమితమైన సిబ్బందితో పాటలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్ను పూర్తిచేసుకున్నది. లాక్డౌన్తో రెండో షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పుడు అనుమతి రావడంతో రెండో షెడ్యూల్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ట్యూన్స్ సిద్ధం చేసినట్టు సమాచారం.