Breaking News

పర్యాటక హబ్ గా గోదావరి తీరం

పర్యాటక హబ్ గా గోదావరి తీరం

సారథి న్యూస్, రామగుండం: వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహాసంకల్పంతో మఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలం కావడంతో గోదావరికి జలకళ సంతరించుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదీతీరాన్ని పర్యాటక హబ్​గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఆదివారం గోదావరి నది వద్ద అడ్వంచర్ అండ్ అక్వా, టూరిజం డెవలప్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

సమైక్యపాలనలో ఎండిన గోదావరి నదికి కొత్తకళ సంతరించుకుందని అన్నారు. గోదావరి నదిపై పడవల పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. బెస్త, ముదిరాజ్ మత్స్యకారులకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉపాధి మార్గాలు పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, తోడేటి శంకర్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాస్, జహీద్ పాషా, ఆడప శ్రీనివాస్, గోలివాడ ప్రసన్నకుమార్, బస్వరాజు గంగరాజు, ఇరుగురాళ్ల శ్రవణ్, మేకల అబ్బాస్, బూరుగు వంశీకృష్ణ, కేశవగౌడ్ పాల్గొన్నారు.