సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలక పరిధిలో మెరుగైన తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించి చేపట్టిన అమృత్ పైప్ లైన్ పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజా నీటి అవసరాలను తీర్చాలని కమిషనర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దపాడు గ్రామ సమీపంలో జరుగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. కాంట్రాక్టర్ నుంచి నిర్దిష్ట టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పనులు జరిగేలా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ సురేంద్రబాబును ఆదేశించారు.
- July 8, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Kurnool
- PEDDAPADU
- కమిషనర్
- కర్నూలు
- పెద్దపాడు
- Comments Off on పనులు కంప్లీట్ చేయండి