సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్స్టేషన్లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్ మందిర్, ప్రభుమందిర్, విట్టలేశ్వరమందిర్, మార్కండేయ మందిర్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళి పంతులు, ఎంపీటీసీ నౌలే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- FESTIVAL
- GANESH
- medak
- MEETING
- PEDDASHAKARAMPET
- గణేశ్చతుర్థి
- పెద్దశంకరంపేట
- మెదక్
- Comments Off on పండుగవేళ.. భద్రంగా ఉండండి