![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/collector.jpg?fit=787%2C707&ssl=1)
సారథిన్యూస్, మహబూబాబాద్: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇల్లందు బై పాస్ రోడ్ లో కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురికి కాల్వల్లో చెత్తను ఏరోజుకారోజు తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచించినట్టుగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు నిలువ ఉన్న నీటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలోని పలు టైర్ల షాపులను పరిశీలించారు. అక్కడ నీరు నిలువ ఉండటంతో దుకాణాలను సీజ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్తోపాటు మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.