![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/HARITHA-HARAM.jpg?fit=1019%2C569&ssl=1)
సారథిన్యూస్, నెట్వర్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ శశాంక మొక్కలు నాటారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో చిన్నారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో సర్పంచ్ పందిరి కళావతి మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ చావ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జెడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ మొగిలి అప్పారావు, రైతు బంధు మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు వేమిరెడ్డి త్రివేణి, టీఆర్ఎస్ నేతలు ఉమా మహేశ్వరి, నారాయణ, ఎంపీటీసీ కిశోర్, ఎంపీటీసీ మల్లికార్జున్రెడ్డి, ఇంచార్జి ఎంపీడీవో, వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్ ముజాహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.