![నాగర్ కర్నూల్ కలెక్టర్గా శర్మన్బాధ్యతల స్వీకరణ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ngkl-collector-2f.jpg?fit=760%2C370&ssl=1)
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా ఎల్.శర్మన్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఓ గర్భిణికి అవసరమైన ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ను స్వయంగా డొనేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.