Breaking News

నాకు కరోనా తగ్గింది

నాకు కరోనా తగ్గింది

తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్​ హీరోయిన్​, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్​ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్​ లైఫ్​ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్​మెంట్​ తీసుకున్నాను. కరోనా ప్రాణాంతకం కాదు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే తగ్గిపోతుంది’ అని నవ్య చెప్పారు నవ్య. కరోనా వచ్చాక ఇబ్బందులు పడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్​ అని చెప్తుందీ ముద్దుగుమ్మ, అయితే ఆమె తిరిగి సీరియల్స్​ నటిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.