![నాకు కరోనా తగ్గింది](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/navya-2.jpg?fit=650%2C715&ssl=1)
తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్ హీరోయిన్, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్ లైఫ్ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. కరోనా ప్రాణాంతకం కాదు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే తగ్గిపోతుంది’ అని నవ్య చెప్పారు నవ్య. కరోనా వచ్చాక ఇబ్బందులు పడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అని చెప్తుందీ ముద్దుగుమ్మ, అయితే ఆమె తిరిగి సీరియల్స్ నటిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.