![బీజేపీ డిమాండ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/bjpp-flaggggggff.jpg?fit=500%2C500&ssl=1)
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.