![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/TAMILCLASSIC-1.jpg?fit=948%2C700&ssl=1)
భారతీరాజా దర్శకత్వంలో దిగ్గజ నటులు కమల్హాసన్, రజినీకాంత్ అందాల తార శ్రీదేవి నటించి సూపర్హిట్ సాధించిన ‘పదినారు వయదినిలే’ చిత్రాన్ని డిజిటలైజ్చేసి తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘నీ కోసం నిరీక్షణ’ అనే టైటిల్ను ఖరారు చేసినట్టు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. తమిళనాడులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం నాలుగు రాష్ట్రీయపురస్కరాలను సొంతం చేసుకున్నది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్ జానకి జాతీయ పురస్కారాన్ని, ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రాన్ని మరో అయిదు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బామా రాజ్ కణ్ణు తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా 5 పాటలను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తున్నదన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్టుగా చిత్రంలో కొన్ని మార్పులు చేసినట్టు చెప్పారు.