![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/CARONA-NGKL-NGKL-NGKLF-1.jpg?fit=2560%2C1902&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.