![తాండ్రలో అధికారుల బృందం పర్యటన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/tandra-2f.jpg?fit=677%2C351&ssl=1)
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని బుధవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారికి వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం పనులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉందని సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక కొరత రాకుండా చూడాలని వారు కిందస్థాయి అధికారులను ఆదేశించారు. అధికారుల బృందంలో ట్రైనీ కలెక్టర్, వెంట డీపీవో, ఎంపీవో, ఎంపీడీవో, టీఆర్ఎస్ నాయకుడు బొల్లె ఈశ్వరయ్య ఉన్నారు.