![జయ బచ్చన్, ఐష్, ఆరాధ్యలకు కరోనా నెగిటివ్..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ISH.jpg?fit=780%2C468&ssl=1)
ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ మూత్రపిండాల నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్లో బిగ్బీకి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక అలాగే అభిషేక్ కూడా టెస్టు చేసుకోగా ఆయనకి కూడా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ కేసులు నిర్వహించారు వైద్యులు. అమితాబ్ భార్య జయ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా టెస్టులు చేయగా.. వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారంతా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బిగ్బీ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటులు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.