Breaking News

గల్ప్​ బాధితుడికి చేయూత

దుబాయ్​ బాధితుడికి చేయూత

సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్​ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్​ సాయంతో దుబాయ్​ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్​, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి సమకూర్చారు. పాస్​పోర్టు లేకపోవడంతో స్వదేశానికి వెళ్లడానికి కావలసిన డాక్యుమెంట్స్​ సిద్ధం చేశారు. అనంతరం అతడికి ప్రయాణ టికెట్​ను కూడా సమకూర్చి స్వదేశానికి పంపించారు. ఈ సందర్భంగా లింగయ్య తనకు సాయం చేసిన రవి బొల్లారం, రవి ఊట్నరు, గణేశ్​ పింజర, చిలుముల రమేశ్​, జైతా నారాయణ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.