![KAIDI DIRECTOR](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KAIDI-DIRECTORRRRFFF.jpg?fit=700%2C524&ssl=1)
తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిళనాట సూపర్హిట్ అందుకున్నది. దీంతో ఖైదీ సినిమా చూసిన మహేశ్ బాబు.. కనగరాజ్ డైరెక్షన్కు ఫిదా అయ్యారట. అయితే వీరు తీయబోయే చిత్రానికి ఓ తెలుగు రచయిత పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేసినట్టు టాక్. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న మహేశ్.. కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటారన్నది తెలిసిన విషయమే. అయితే కనగరాజ్ దర్శకత్వంలో మహేశ్ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు టాక్. మహేశ్ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ‘సర్కార్ వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత కనకరాజ్ సినిమా ప్రారంభించనున్నట్టు టాక్. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్టు సమాచారం.