ముంబై: ఇక నుంచి క్రీడలు కూడా చదువులో భాగంగా ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వీటిని అదనపు పాఠ్యాంశాలుగా భావించకూడదన్నారు. ‘దేశంలో తీసుకొస్తున్న కొత్త విద్యాచట్టంలో ఈ విధానమే ఉంటుంది. చదువు, క్రీడలు వేర్వేరు కావన్నది నా అభిప్రాయం. క్రీడలను అప్షనల్ సబ్జెక్ట్గా పరిగణించవద్దు. అది కూడా చదువులో భాగమే. మా విద్య విధానాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. వీలైనంత త్వరగా దానిని తీసుకొస్తాం’ అని రిజిజు పేర్కొన్నారు. జాతీయ క్రీడా విద్యా విధాన బోర్డును రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోర్డు ఏర్పాటులో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఈ కమిటీ చర్చిస్తుందన్నారు.
- June 12, 2020
- Archive
- Top News
- క్రీడలు
- KIRAN RIZUZU
- SRORTS
- క్రీడా విద్యా విధానం
- క్రీడాశాఖ
- రిజుజు
- Comments Off on క్రీడలు ఎడ్యుకేషన్లో భాగమే