![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/KORATALAAAF.jpg?fit=225%2C225&ssl=1)
వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ హీరోలో హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.