Breaking News

కొత్త నేషనల్​ హైవే పనులు చేపట్టండి

కొత్త నేషనల్​ హైవే పనులు చేపట్టండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కల్వకుర్తి నేషనల్​హైవే 167 నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూరు, కరివేన నేషనల్​హైవే 340 ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని మంగళవారం నాగర్​కర్నూల్ ​ఎంపీ పోతుగంటి రాములు నేషనల్​రోడ్డు ట్రాన్స్​పోర్ట్​, హైవేస్​ సెక్రటరీ గిరిధర్​ను కలిసి కోరారు. గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కోసం డీపీఆర్​ను త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఈఆర్ఎఫ్​ రోడ్స్ మంజూరు చేయాలన్నారు. అలంపూర్ 5వ శక్తిపీఠం జోగుళాంబ ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని టూరిజం, కల్చరల్ శాఖ కార్యదర్శి యోగేంద్ర త్రిపాఠిని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని ఎంపీ రాములు తెలిపారు.