![కృష్ణవంశీ సినిమాలో అనసూయ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ANU.jpg?fit=343%2C550&ssl=1)
బుల్లితెర యాంకర్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో నటిగా కూడా అన్నే మార్కులు కొట్టేసింది అనసూయ. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘రంగస్థలం’ తర్వాత సోలో హీరోయిన్ గా ‘కథనం’ సినిమా చేసింది. సినిమా అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కథలో తనపాత్ర కీలకంగా ఉండడంతో అనసూయ వెంటనే ఓకే అనేసిందట.
బుల్లితెర, వెండితెర మీద నటిస్తున్న అనసూయ ఈ సినిమాలో నాటకాలు వేసే కళాకారిణిగా నటించనుందట. నటనకే తన జీవితాన్ని అంకితం చేస్తూ జీవితాంతం అవివాహితగానే ఉండిపోయే పాత్రను పోషించనుందట. తన ఫెవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇచ్చిన ఈ ఆఫర్తో ఆనందంతో తబ్బిబ్బులవుతోందట అనసూయ. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టగా.. ఈ సినిమాను అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.