సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రైతులు తమ పంటపొలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ కోరారు. గురువారం ఆయన మండలంలోని జాంబికుంట, మూసాపేట తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కల్లాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలను నిర్మించి ఇస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేశ్ గౌడ్, ఎంపీడీవో రామ్ నారాయణ , జంబికుంట, మూసాపేట్ గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, మామిడి సాయిలు. టిఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, రఘుపతి రెడ్డి, బక్కరెడ్డి ఎంపీటీసీ రాజు, ఏఈవో సుధాకర్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేశ్, ఎంపీటీసీ సభ్యులు, వీణా సుభాష్ గౌడ్, స్వప్నా రాజేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, శివాయపల్లి సర్పంచ్ నరేశ్, ఎంపీవో రియాజోద్దిన్ పాల్గొన్నారు.
- September 10, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- KCR
- MEDAK DISTRCT
- TELANGANA
- TRS
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on కల్లాలు నిర్మించుకోండి