Breaking News

కరోనాను జయించిన హెడ్​కానిస్టేబుల్​

కరోనాను జయించిన కానిస్టేబుల్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనాను జయించి శుక్రవారం విధుల్లో చేరడానికి వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డిని కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు పూలమాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. హెడ్‌ కానిస్టేబుల్‌కు కొద్దిరోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో పోరాడి ఇటీవల ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆస్పత్రిలో అందిన వైద్యసేవలు, అక్కడ ఇచ్చిన మెడిసిన్స్‌, తీసుకున్న ఆహారం తదితర వివరాలను వెల్లడించారు. పోషకాహారం, జాగ్రత్తలతో పాటు మనోధైర్యంతో త్వరగా కోలుకోవచ్చని, ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డి తెలిపారు. ఆయనను సన్మానించిన వారిలో ఒకటవ పట్టణ సీఐ శ్రీ విక్రమసింహా, పోలీసు సిబ్బంది ఉన్నారు.