Breaking News

కరోనా చాలెంజ్​ను ఎదుర్కొందాం

కరోనా చాలెంజ్​ను ఎదుర్కొందాం
  • ఈ పరిస్థితుల్లో నైపుణ్యమే కీలకం
  • వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనకు సరికొత్త చాలెంజ్‌లను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డేను పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ స్కిల్స్‌కు పదును పెట్టాలని మోడీ చెప్పారు. ‘మీ స్కిల్స్‌ను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితమిచ్చారు. కొత్త కొత్త స్కిల్స్‌ను అందిపుచ్చుకోవడమే కోట్లాది మంది యువత బలం. కరోనా వైరస్‌ నేచర్‌‌ ఆఫ్‌ జాబ్స్‌ను మార్చేసింది. మన జీవితాలపై ఇంపాక్ట్‌ చూపించే కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. యువత ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను ఎంచుకోవాలి’ అని మోడీ అన్నారు.

ఇప్పటి పరిస్థితిలో నిలదొక్కుకోవాలంటే ‘స్కిల్‌, రీ స్కిల్‌, అప్‌స్కిల్‌’ అనే మంత్రాన్ని పాటించాలని ప్రధాని సూచించారు. జ్ఞానం, నైపుణ్యం మధ్య కొందరు ఎప్పుడూ కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారని అన్నారు. పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌ చూసి చాలా నేర్చుకోవచ్చని, దాన్ని ఆచరణలో పెట్టేందుకు స్కిల్‌ కావాలని అన్నారు. ఏదైనా కొత్త స్కిల్‌ నేర్చుకోవాలంటే నైపుణ్యం నేర్చుకోవాలన్న తపన ఉండాలని లేకుంటే జీవితం ఆగిపోతుందని అన్నారు.