![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/tdpppppppf.jpg?fit=1000%2C600&ssl=1)
సారథి న్యూస్, వరంగల్: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడు చిటూరి అశోక్ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు మహేశ్, తోట రమేశ్, అంబటి ప్రభాకర్, కొంగర ప్రభాకర్, కలమాల మహేందర్, అనిశెట్టి సతీశ్, కటకం కుమార్ స్వామి, బైరీ శేషాద్రి, కాగితాల జయశంకర్, ఎలగందుల రవీందర్ గుప్తా, హరిదాస్యం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.