సారథి న్యూస్, ములుగు: ఏటా జనవరి 1 నాటికి చేపట్టే స్పెషల్డ్రైవ్లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని, అలాగే చనిపోయినవారిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణాఆదిత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో లిస్టులో పేరు మాత్రమే ఉండేదని, ఇప్పుడు పేరుతో పాటు ఫొటో కూడా ఉందన్నారు. 10వ తరగతి సర్టిఫికేట్ లేదా ఆధార్ వివరాల ఆధారంగా ఓటరుగా అర్హత కలిగినట్లు గుర్తించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులంతా ఎన్నికల నియామవళిని పాటిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 5,6 తేదీల్లో ప్రత్యేకంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టినప్పుడు బూత్ లెవల్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, ములుగు ఆర్డీవో రమాదేవి, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- December 19, 2020
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- CHIRANJEEVULU
- MULUGU
- VOTERENROLEMENT
- ఓటరు నమోదు
- చిరంజీవులు
- ములుగు
- Comments Off on ఓటరు నమోదులో పొరపాట్లు జరగొద్దు