Breaking News

ఐపీఎలే బెస్ట్

ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జోస్ బట్లర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందడానికి ఐపీఎల్ చాలా దోహదపడిందని ఆ దేశ బ్యాట్స్​మెన్​ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్​ల తర్వాత ఐపీఎల్ బెస్ట్ టోర్నీ అని కితాబిచ్చాడు. ఈసారి లీగ్ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఇంగ్లిష్ క్రికెట్ పురోగతి సాధించడానికి ఐపీఎల్ చాలా సాయం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వాళ్లంతా ఆటపరంగా, ఆర్థికంగా చాలా అభివృద్ధి సాధించారు. ఇప్పుడు కూడా ఈ లీగ్​పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. నా వరకైతే ఈ టోర్నీలో ఆడేందుకు నేనెప్పుడూ రెడీగా ఉంటా. ఐపీఎల్​లో జరిగే కొన్ని మ్యాచ్​లు ఉత్కంఠరేపుతాయి. బెంగళూరు టీమ్ టాప్–3లో ఉంటుంది. కోహ్లీ, డివిలియర్స్, గేల్​తో కలిసి బుమ్రా, స్టెయిన్, మలింగను ఎదుర్కోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని బట్లర్ వ్యాఖ్యానించాడు.