Breaking News

ఇసుకను తరలిస్తే ఉపేక్షించం

సారథిన్యూస్, రామడుగు: ఇసుకను అక్రమంగా రవాణాచేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదన్నారు. అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. బుధవారం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్​చేశారు.