![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/inkau.jpg?fit=1040%2C780&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మించుకోవాలని కరీంనగర్ జిల్లా రామడుగు సర్పంచ్ సత్యప్రసన్న కోరారు. ఆదివారం గోపాల్ రావు పేట్ మూడవ వార్డులో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.4100 ఇస్తుందన్నారు. వార్డులో 15 మంది ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు.