Breaking News

అధ్వానంగా రోడ్లు

టీఆర్​ఎస్​ జెండాలు పాతి ధర్నా

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్లు ఆధ్వానంగా మారినా అధికారులు, ​ మంత్రులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గుంతలుపడ్డ రోడ్లపై వారు టీఆర్​ఎస్​ జెండాలు పాతి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతూ.. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు అక్క శ్రీనివాస్​, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజయ్య, కిష్టస్వామి, రాజు, సది తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం వీరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.