![అది ప్రభుత్వ నిర్ణయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/jeevan_supreme.jpg?fit=449%2C235&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. సచివాలయం నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదని అత్యున్నత న్యాయం స్థానం స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పు సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే వారికి చెంపపెట్టు అని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.