సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆర్ జీవన్ సంఘం కార్యదర్శి మెండే శ్రీనివాస్, నాయకులు కె రంగారావు , ఏం సారయ్య కార్మికులు పాల్గొన్నారు,
- July 11, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- LABOUR
- SINGARENI
- TRANSFERS
- యాజమాన్యం
- సింగరేణి
- Comments Off on అక్రమ బదిలీలు ఆపండి