![అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/hsbd2.jpg?fit=932%2C1280&ssl=1)
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండలాధ్యక్షుడిగా కొయ్యడ కార్తీక్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పదవి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్క్షతలు తెలిపారు. కార్తీక్ ఎన్నిక పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.