సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ఏ స్మైల్’ పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కొత్త అంబులెన్స్ను బహూకరించారు. ఈ అంబులెన్స్ ను మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రగతిభవన్ లో శనివారం ప్రారంభించారు. అలాగే గిఫ్ట్ఏ స్మైల్ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఐదు కొత్త అంబులెన్స్లను బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, జి.జగదీశ్వర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
- September 19, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GIFT ASMILE
- GUVVALA
- MINISTER KTR
- గిఫ్ట్ఏ స్మైల్
- గువ్వల
- మంత్రి కేటీఆర్
- Comments Off on అంబులెన్స్ బహూకరణ