Breaking News

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

సారథి, నాగర్​కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్​వో) డాక్టర్​ సుధాకర్​లాల్ ​వైద్యాధికారులతో జూమ్​ మీటింగ్ ​నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ​ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ వెంకట్ దాస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఎస్ సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, రేణయ్య, సందీప్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.