Breaking News

టీఆర్ఎస్ విజయం లాంఛనమే

టీఆర్ఎస్ విజయం లాంఛనమే
  • విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సామాజిక సారథి, హాలియా: స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లా శాసన మండలికి జరుగుతున్న ఎన్నిక లాంఛనప్రాయమే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్ లో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి,  ఎంపీ బడుగుల లింగయ్య  హాజరై వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థి ఎం సి కోటిరెడ్డి విజయం ఇప్పటికే గెలుపు ఖాయమైనది అని అన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలు అందుకు నిదర్శనం అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు రామ్ చందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు,ఎడవల్లి విజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.