Breaking News

బ్రేకింగ్​..హుజూరాబాద్​ లో టీఆర్​ఎస్ వెనుకంజ

హుజురాబాద్​లో టీఆర్​ఎస్​ వెనుకంజ

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్​ఎస్​ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 6వ రౌండ్​ ముగిసే సరికి 2,971 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ​యాదవ్​కు 3,639(23,797) ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 4,656 (26,983 ) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్​వెంకట్​కు 180 (992 ) ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 1,017 (3,186)ఓట్లతో లీడ్​లో ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా, 7 వ రౌండ్​లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ కు 3,792 (27,589) ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్​లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ 252 (3,438) ఓట్ల ఆధిక్యం కనబరిచారు.