Breaking News

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా ఒకే ప్రాంతంగా ఉంచాలని డిమాండ్​చేశారు. ఏజెన్సీ ప్రాంత ఏకీకరణకు ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్సా నరసింహామూర్తి నాయకత్వంలో త్వరలోనే విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణసేన మండల కార్యదర్శి ముర్రం కార్తీక్, ఆదివాసీ నవనిర్మాణ విద్యార్థి సేన మండలాధ్యక్షుడు కుర్షం విజయ్, నరేష్, కిరణ్, చంటి, శరత్ పాల్గొన్నారు.