![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/07/IMG-20230725-WA0001.jpg?fit=1280%2C647&ssl=1)
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడల సమ్మేళనం ఈ నెల 27,28 తేదీలలో వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఖోఖో,బ్యాడ్మింటన్, చెస్,యోగ,కబడ్డీ,టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నవోదయ విద్యాలయాల క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో వివిధ క్యాటగిరిలలో ఉత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులను రీజనల్ స్థాయికి ఎంపిక చేసి పంపుతామని ఆయన చెప్పారు.దాదాపు 400 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు.